బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయిన ఈ ఏడుగురిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది.ఈ ఏడుగురిలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ లు సేఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలిన ముగ్గురిలో వితికా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో చివరి స్థానంలో వితికా ఉందని సమాచారం. అనఫిషియల్ ఓటింగ్స్ ప్రకారం వితికాకి తక్కువ అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయని వినిపిస్తుంది


ఇదిలా ఉంచితే,  బుధవారం ఎపిసోడ్ లో ఆలీ వ్యవహార శైలి చర్చలకు దారి తీసింది. బాబా భాస్కర్ ఫ్యామిలీ వచ్చినపుడు ఆయన మాట్లాడిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఆయన పట్ల ప్రతికూలత వ్యక్తం చేస్తున్నారు. అసలే రీ ఎంట్రీ ఇలు ఇచ్చినప్పటి నుండి అతనిలో చాలా మార్పు వచ్చింది. దానివల్ల ప్రేక్షకులు అతని పట్ల సానుకూలతగా లేరు. అదీ గాక బాబా భాస్కర్ గురించి ఆయన మాట్లాడిన విధానం వల్ల ఓటింగ్ లో చాలా మార్పులు వచ్చి, చివరి స్థానానికి వచ్చేశాడు.


దాంతో వితికా కొద్దిగా పైకెళ్ళింది. అయితే శివజ్యోతి ఏడుపు వల్ల కూడా ఆమె నష్టపోయిందనే చెప్పాలి. ప్రతీసారి ఏడవటం ఆమెకి నెగెటివ్ గా మారింది. ఈ ప్రభావం ఓట్లపై చాలానే పడింది. వీరిద్దరి వ్యవహారం ఇలా ఉండటం వల్ల వితికా చాలా లాభపడింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఆలీ చివరి స్థానంలో కొనసాగుతున్నాడు.


 
బాబా భాస్కర్ గురించి శివజ్యోతితో మాట్లాడటం అతనికి పెద్ద మైనస్ అయింది. దానివల్ల ఆలీ డేంజర్ జోన్ లోకి వచ్చేశాడు. ఇక శివజ్యోతి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరంగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ వారం ఆలీ ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే గనక ఆలీతో పాటు, శివజ్యోతి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ రసవత్తరంగా మారనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: