మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్నారు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు ఇంద్ర తరహాలో విజయం సాధించడంతో మెగా అభిమానులు కూడా చిరంజీవి ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన సైరా సినిమా కి చిరంజీవి దాదాపు రెండు సంవత్సరాలపాటు టైం కేటాయించడంతో తన నెక్స్ట్ కొరటాల దర్శకత్వంలో చేయబోయే సినిమా అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఈ సినిమా చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి చిరంజీవి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు త్వరలోనే అనగా డిసెంబర్ నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.



మొన్న దసరా పండుగ సందర్భంగా సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్నది సస్పెన్స్ గా మారటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు మెగా అభిమానుల్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. చిరంజీవి నటిస్తున్న ఈ 152 సినిమా హీరోయిన్ విషయంలో ఎప్పటికైనా నయనతార కాజల్ అనుష్క ఇంకా చాలామంది పేర్లు అప్పట్లో వినపడటం జరిగాయి కానీ ఏదీ కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా చిరంజీవి పక్కన హీరోయిన్ త్రిష నీ సెలెక్ట్ చేసినట్లు ఫిలిం నగర్ లో వినబడుతున్న టాక్.


గతంలో చిరంజీవితో త్రిష 'స్టాలిన్' చిత్రంలో నటించింది. హీరోయిన్ గా త్రిష ఫేడ్ ఔట్ అయినట్లుగా అనిపించినా మళ్లీ పుంజుకుంటుంది. తమిళంలో ఈమె 96 చిత్రంతో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. అంతేకాకుండా తెలుగులో త్రిషా కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ వార్త బయటకు రావడంతో చిరంజీవి త్రిష కాంబినేషన్ బాగానే ఉంటుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: