మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తన తనయుడు రామ్ చరణ్ నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరోగా నటించారు. గాంధీ జయంతి నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా యావరేజ్ గా నిలిచిన విషయం తెలిసిందే. యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పాత్ర పోషించడం జరిగింది. అయితే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మరియు సెట్స్ అలానే మెగాస్టార్ యాక్టింగ్ వంటివి అదిరిపోయినప్పటికీ, 

ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా దర్శకుడు సినిమాను తెరకెక్కించలేదనే విమర్శలు బాగా వినపడ్డాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా ముహూర్తం ఇటీవల ఎంతో లాంఛనంగా జరిగింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన నాలుగు సినిమాలతో భారీ విజయాలు తన ఖాతాలో వేసుకున్న కొరటాల, ఈ సినిమాను కూడా మంచి సక్సెస్ సాధించే విదాంగా అన్ని అంశాలు కలగలిపి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేసినట్లు రెండు రోజులుగా ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ఇటీవల కొరటాల, ఈ సినిమా కథను త్రిషకు వినిపించడం జరిగిందని, కథ బాగా నచ్చిన త్రిష వెంటనే నటించాడనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. నిజానికి గతంలో మెగాస్టార్ సరసన మురుగదాస్ తెరకెక్కించిన స్టాలిన్ సినిమాలో నటించిన త్రిష, ఈ విధంగా రెండవ సారి ఆయనతో జోడి కడుతోంది. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజం అయితే మాత్రం, త్రిష రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: