జబర్దస్త్ కామెడీ రియాల్టీ షో తో యాంకర్ గా అందరికీ సుపరిచితురాలైన అనసూయ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. ఒకపక్క టెలివిజన్ రంగంలో రాణిస్తూ మరోపక్క సినిమారంగంలో కూడా వరుస అవకాశాలు క్రేజీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ సక్సెస్ఫుల్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో నటించి మెగా అభిమానులను మరియు తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కెరీర్ పరంగా ఒక పక్క సక్సెస్ ఫుల్ గా జర్నీ సాగుతున్న కానీ సోషల్ మీడియా పరంగా అనసూయ వివాదాలకు కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా ఇటీవల బుక్ అయిపోతుంది.


మేటర్ లోకి వెళ్తే రౌడీ విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారి నిర్మించిన మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నవంబర్ ఫస్ట్ న విడుదల కానుంది. ఈ సినిమాలో అనసూయ ఒక కీలకమైన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన సందర్భంలో అర్జున్ రెడ్డి అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ బూతులు మాట్లాడటం పై వాడటంపై అనసూయ ఆ సందర్భంలో విజయ్ దేవరకొండ పై  చాటింగ్ కామెంట్లు చేయడం జరిగింది.


కానీ విజయ్ దేవరకొండ ఒక్క మాట కూడా అనసూయపై మాట్లాడలేదు. కాగా ఇదే సందర్భంలో విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం అనసూయని ట్రోల్ చేశారు. ఇలా ఉండగా తాజాగా ఇటీవల 'మీకు మాత్రమే' చెప్తా ప్రమోషన్లలో భాగంగా ఇదే విషయం ప్రస్తావించినప్పుడు అనసూయ క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా స్టోరీ నచ్చిందని గతంలో తమ ఇద్దరి మధ్య జరిగిన వివాదం అంత ప్రభావం కూడా ఏమీ లేదని అనసూయ క్లారిటీ ఇచ్చింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: