సుమారు ఇరవయ్యేళ్ల క్రితం ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని హీరో సుమంత్ తనకంటూ పెద్దగా మార్కెట్ ఏర్పరుచుకోలేకపోయారు. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సుమంత్‌కు ‘సత్యం’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరవాత కమర్షియల్ యాక్షన్ చిత్రాలు కూడా చేశారు. కానీ, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇప్పటికీ సుమంత్ అంటే గుర్తొచ్చేది ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలే. కిందటేడాది ‘సుబ్రమణ్యపురం’, ‘ఇదం జగత్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

అయితే, ఇపుడు రాజశేఖర్ హీరోగా అనుకున్న సినిమా ప్రాజెక్ట్ లో రాజశేఖర్ బదులుగా సుమంత్ ని హీరోగా ఎంపిక చేసినట్లు సమాచారం.రాజశేఖర్ కల్కిసినిమా తరువాత హీరోగా సినిమా ఏదీ ఇంకా స్టార్ట్ కాలేదు. అంతకుముందు గరుడవేగ తరువాత కూడా ఇలాగే చాలా టైమ్ పట్టింది. కల్కి సినిమా తరువాత రెండు మూడు ప్రాజెక్టులు వినిపించాయి.అందులో తమిళ నిర్మాతల ప్రాజెక్టు ఒకటి. ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.మామూలుగా అయితే రాజశేఖర్ ఇలాంటి పాత్రలకు పెర్ ఫెక్ట్ సెట్. మరి ఏమయిందో? ఎందుకు మారిందో కానీ సినిమా ఇప్పుడు చేతులు మారి, సుమంత్ దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది.

అయితే, సినిమా పూర్తిగా క్యాన్సిల్ కాలేదు. హీరో మాత్రమే మారిపోయినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కు బదులుగా సుమంత్ ను తీసుకుని ప్రాజెక్టు చేయబోతున్నట్లు బోగట్టా. అనేక జోనర్లు ట్రయ్ చేసిన తరువాత సుమంత్ ఇప్పుడిప్పుడే కాస్త సెటిల్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ థ్రిల్లర్ తో సుమంత్ మరికాస్త సెటిల్ అయ్యే అవకాశం వుంది.అంతేకాదు ఈ సినిమాకు కన్నడంలో సూపర్ హిట్ అయిన కవుల్దారి అనే సినిమా ఆధారం. ఈ సినిమా పోలీస్ స్టోరీ. థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ కాబటి తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: