పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అసమాన్యమైనది. ఆయన ప్రతి సినిమాకి అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. మొదటి నాలుగు సినిమాలకు చిరంజీవి తమ్ముడిగా తర్వాత పవర్ స్టార్ గా ఆయన స్థాయి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా రాజకీయాల్లో ఉన్న ఆయన మళ్లీ సినిమాలు చేస్తారనే టాక్ వస్తోంది. ఇందుకు ఇద్దరు డైరెక్టర్లు లైన్ లో ఉన్నారని సమాచారం. అయితే..

 

 

పవన్ కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్, క్రేజ్ దృష్ట్యా ఆయన మళ్లీ సినిమా చేస్తే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. ఆయన ఎంచుకునే కథ, దర్శకుడిపై ఫ్యాన్స్ ప్రభావం ఉంటుంది. ఇటీవల క్రిష్ ఓ కథ వినిపించాడని దీనికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ మూవీకి ఆ కథ ఓకే అన్నట్టు వార్తలొచ్చాయి. అయితే.. హరీశ్ శంకర్ కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఈవార్తకు ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. క్రిష్ వైపు ఫ్యాన్స్ ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ తో హరీశ్ చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. పదేళ్ల తరువాత పవన్ స్టామినాను మ్యాచ్ చేసే సినిమా ఇచ్చిన హరీశ్ పైనే అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. క్రిష్ కు పెద్ద హీరోతో హిట్ ఇచ్చిన ట్రాక్ రికార్డు లేకపోవటమే ఇందుకు కారణం.

 

 

పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్నాడంటే అభిమానులకు పండగే. భారీ ఓపెనింగ్స్ ఖాయం. టాక్ సరిగ్గా పడితే కలెక్షన్లకు తిరుగుండదు. అజ్ఞాతవాసి ఓపెనింగ్సే ఇందుకు ఉదాహరణ. మరి.. ఈ వార్తలన్నీ నిజామో కాదో తెలియాలంటే పవన్ కల్యాణ్ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: