టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి పేరు మరియు క్రేజ్ తో కొనసాగుతున్న హీరోయిన్స్ కొంత మంది ఉన్నారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క శెట్టి, రష్మిక మందన్న, కీర్తి సురేష్, తమన్నా, రాశి ఖన్నా, పూజ హెగ్డే సహా మరికొందరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ, వారిలో అందరికంటే ఒకింత ఎక్కువగా పేరు సంపాదించి ముందంజలో ఉంది మాత్రం అనుష్క మరియు కీర్తి సురేష్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. నిజానికి క్రేజ్ పరంగా వారిద్దరితో సరిసమానంగా తూగే మరొక ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ, యాక్టింగ్ పరంగా ఎటువంటి పాత్రలో అయినా ఎంతో అద్భుతంగా నటించి ఆడియన్స్ మనసు గెలుచుకోగల నేర్పు వారిద్దరికి ఎక్కువగా ఉందని అంటున్నారు. 

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్, ఆ సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో పాటు తన అందంతో కుర్రకారు మనసు దోచారు. ఆ తరువాత ఆమె నటించిన నేను లోకల్ సినిమా కూడా మంచి హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత గత ఏడాది వచ్చిన మహానటి సినిమా, కీర్తి సురేష్ కు యెనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది అనే చెప్పాలి. ఆ సినిమాలో మహానటి సావిత్రి గారి మాదిరిగా నటించి ఆడియన్స్ ని మెప్పించిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మరొక నటి అయిన అనుష్క శెట్టి, కొన్నేళ్ల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. 

ఆ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ, దాని అనంతరం విక్రమార్కుడు, లక్ష్యం, సినిమాలతో మంచి విజయాలు అందుకున్న అనుష్క, అదే సమయంలో కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో ఒక్కసారిగా తనలోని అద్భుత నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ సినిమా అతిపెద్ద విజయాన్ని అందుకుని, నటిగా అనుష్కకు మంచి బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ఆ తరువాత నుండి టాలీవుడ్, కోలీవుడ్ సహా పలువురు స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క, ఇటీవల భాగమతి, బాహుబలి సినిమాలతో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం మంచి కెరీర్ తో కొనసాగుతున్న వీరిద్దరూ, రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నట్లు సమాచారం. మరి వీరిద్దరి హవా ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: