నిధి అగర్వాల్... హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా తర్వాత నుంచీ అందాలతోపాటూ... నటన కూడా చూపిస్తూ అదరగొడుతోంది నిధి. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి... పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు కొట్టేస్తోంది ఈ చిన్నది.


మజ్ను చిత్రం తో యూత్ లుక్స్ ని తన వైపు తిప్పుకుని ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో సౌత్ లో లీడింగ్ స్టార్ గా మారిన నిధి అగర్వాల్ .. కొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. ఫేమస్ ర్యాప్ సింగర్.. మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాతో కలిసి కొత్త ఆల్బమ్ చేయబోతోంది ఈ భామ. అద్భుతమైన మ్యూజిక్ అండ్ లిరిక్స్ కి నిధి స్టెప్స్ వేయబోతోంది. బాద్షా, నిధి కాంబినేషన్ ఇండస్ట్రీని ఊపేస్తుందంటున్నారు ఫ్యాన్స్.


ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ ఫుల్ ఫాంలో ఉంది. సౌత్ లో అన్ని భాషల్లో దర్శకుల చూపు నిధి వైపు చూస్తున్నాయి.. కమర్షియల్ చిత్రాలకు అప్ట్ హీరోయిన్ గా నిధి ఫేమ‌స్ అయ్యింది.. త్వరలో తమిళ్ లో జయం రవితో కొత్త మూవీ చేస్తుంది..తెలుగు లో ఒక పెద్ద ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసింది.. త్వరలోనే ఆ వివరాలు తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తుంది.


ఇదిలా ఉంటే ఇటీవ‌లే మంచుల‌క్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాముడి లాంటి వ్యక్తి జీవిత భాగస్వామగా కావాలని మనసులో మాటను బయటపెట్టింది నిధి అగర్వాల్. తన జీవితంలో కృష్ణులాంటి వాళ్లు చాలా మందే ఉన్నారనడంతో మంచు లక్ష్మి పడిపడి నవ్వింది. ఇక తనకు ఫ్లవర్స్, ఖరీదైన డిన్నర్ వద్దన్న నిధి.. ఇంటి వద్ద పిజ్జాలు తినకుంటూ సినిమా చూడలని.. ఇదే తన డ్రీమ్ డేట్ అని చెప్పుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: