యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్న గీత గోవిందం సినిమా తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. అందుకే రష్మిక మందన్న తక్కువ టైంలోనే మహేష్ బాబు సరసన సోలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకోవడం పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. శాండల్ వుడ్ కు చెందిన రష్మికకు అక్కడకంటే ఇక్కడే ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే సబ్జెక్టు సెలక్షన్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్లాపులు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో ఒప్పుకున్న దేవదాస్ - డియర్ కామ్రేడ్ సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో రష్మిక బాగా డిసప్పాయింట్ అయిన సంగతి తెలిసిందే.   

తాజాగా సరిలేరు నీకెవ్వరూ-భీష్మ సినిమాలలో నటిస్తున్న రష్మిక మందన్న ఇటీవలే దిల్ రాజు త్వరలో తీయబోయే సినిమాకు నో చెప్పినట్టుగా వస్తున్న వార్త ఫిలిం నగర్ లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారింది. మహేష్ మూవీ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య హీరోగా శశి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం చైతు-సాయిపల్లవి-శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పూర్తి కాగానే జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో చైతు పాల్గొనేలా ప్లానింగ్ చేశారు.

అందుకే చైతూ కి జోడిగా రష్మికను అడిగారట. కథ నచ్చలేదో తన పాత్రకు ప్రాధాన్యం తక్కువగా ఉందనుకుందో ఖచ్చితమైన కారణం తెలియదు కానీ మొత్తానికి స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఆఫర్ కి మొహమాటం లేకుండా నో చెప్పినట్టు తెలుస్తోంది. డేట్స్ లేక చెప్పిందో లేక పెద్ద స్టార్లతోనే చేయాలని నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ రష్మిక తీసుకున్న ఈ డెసిషన్ ఎంత వరకు కరెక్ట్ అనేది ఆ సినిమా రిలీజయ్యాకే తెలుస్తుంది. ఇక 2020 సమ్మర్ లో రిలిజ్ కి ప్లాన్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు వేరే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: