టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సంచలన దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, తొలిసినిమా పర్వాలేదనిపించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన కాజల్, ఆ సినిమాలో తన ఆకట్టుకునే అందం మరియు అభినయంతో అదరగొట్టింది. ఆ తరువాత ఏకంగా రామ్ చరణ్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న కాజల్, ఆ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో అక్కడి నుండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

ఆ తరువాత టాలీవుడ్ సహా పలువురు కోలీవుడ్ స్టార్ హీరోల ప్రక్కన హీరోయిన్ గా నటించి మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న కాజల్, ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' మరియు ప్రశాంత్ వర్మ 'అ' సినిమాల్లో తన అలరించే నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ మరియు శంకర్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా భారతీయుడు2 లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తనకు ఒక కోరిక మాత్రం ఎప్పటినుండో తీరకుండా అలానే మిగిలిపోయిందని అంటోంది. అదేమిటంటే, 

ఇప్పటివరకు దాదాపుగా అందరు హీరోలతో నటించిన తాను, తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో మాత్రం నటించే ఛాన్స్ ఇప్పటివరకు రాలేదని, ఆయనతో నటించాలి అనేది తన చిరకాల కోరిక అని ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయట పెద్దింది కాజల్. అతి త్వరలో ఆ కోరిక తీరాలని దేవుడిని కోరుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ప్యారిస్ ప్యారిస్, ముంబై సాగా, అనే సినిమాలతో పాటు కాల్ సెంటర్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది. రాబోయే రోజుల్లో రజినీకాంత్ సరసన నటించాలనే ఆమె కోరిక ఎంతవరకు తీరుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: