'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా 'సాహో'. సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలయి అభిమానులను సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచింది. తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ఎక్కడా కూడా విజయం సాధించలేదు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేయడంతో భారీ అంచనాలు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు పెట్టుకోవడం జరిగింది సాహో పై. అయితే యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా అంచనాలను తలకిందులు చేస్తూ తీవ్ర నిరాశ పరిచింది.


దాదాపు ఈ సినిమా కోసం ప్రభాస్ రెండు సంవత్సరాలు తన టైం కేటాయించడంతో అభిమానులు కూడా అనవసరంగా ప్రభాస్ సాహో సినిమా చేశారని అనేక కామెంట్లు సోషల్ మీడియాలో చేయడం జరిగింది. దీంతో  సాహో ఎఫెక్ట్ నుంచి బయటపడ్డ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. యువి క్రియేషన్స్ సంస్థ సాహో చిత్రాన్ని 350 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సంగతి తెలిసిందే.సాహో చిత్రంతో యువి క్రియేషన్స్ నిర్మాతలకు చిక్కులు ఎదురవుతున్నాయి.


బాగ్స్ సంస్థ సాహో నిర్మాతలపై కేసు నమోదు చేయబోతున్నట్లు సమాచారం. సాహో నిర్మాతలకు, బాగ్స్ కంపెనీకి మధ్య 1.45 కోట్ల వ్యవహారానికి సంబంధించిన విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ దర్శకుడు రాదా కృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కలిగిన సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో సాహో సినిమా ప్రొడ్యూసర్ పై కేసు నమోదు కావడం పైగా నిర్మాతలు ప్రభాస్ కి ఫ్రెండ్స్ కావడంతో ఈ విషయంలో ప్రభాస్ ఏవిధంగా స్పందిస్తారో అని అభిమానులు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: