టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన తొలిసారి రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా సీనియర్ నటి, లేడీ అమితాబ్ విజయశాంతి ఎన్నో ఏళ్ల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి, 

ఇటీవల ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు, ఈ సినిమా గురించి తన యూట్యూబ్ ఛానల్ లో కొంత సమాచారం ఇచ్చారు. ఎన్నో ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా తాను విజయశాంతి గారితో కలిసి నటిస్తున్నానని, అప్పట్లో సెట్స్ లోని నటీనటులు అందరూ కలసి ఎంతో సంబరంగా భోజనాలు చేసేవారని, అయితే ఇప్పటి రోజుల్లో ఎవరి కార్ వ్యాన్స్ లోకి వాళ్ళు వెళ్లి ఒంటరిగా తినేయడం చూసి విజయశాంతి కొంత ఆశ్చర్యపోయారని పరుచూరి తెలిపారు. తనని అంకుల్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే విజయశాంతి గారు, కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక పవర్ఫుల్ పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నారని, 

అలానే ఆమెకు తండ్రి పాత్రలో తాను నటిస్తున్నట్లు చెప్పారు పరుచూరి. అయితే షూటింగ్ సమయంలో విజయశాంతి గారితో కలిసి నేను దిగిన ఫోటోని దర్శకుడు అనిల్ బయట పెట్టవద్దని కోరారని, అందుకే అక్కడి సెట్లో తాను ఒంటరిగా దిగిన ఒక ఫోటోను ఆ వీడియోలో చూపించారు పరుచూరి గోపాలకృష్ణ గారు. అయితే ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా రేపు రిలీజ్ అయిన తరువాత విజయశాంతి గారికి తప్పకుండా నటిగా మంచి బ్రేక్ ని ఇస్తుందని మాత్రం తాను గట్టిగా చెప్పగలనని, అలానే ఆమె రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఆమె ఫ్యాన్స్ కు ఈ సినిమాలోని ఆమె పాత్ర ఎంతో సంతృప్తిని కూడా ఇస్తుందని తెలిపారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: