‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీల విడుదల డేట్ ఖరార్ కావడంతో మహేష్ బన్నీల మధ్య జరగబోతున్న ఈ బుల్ ఫైట్ లో ఎవరు విజేత అన్నవిషయమై ఇప్పటి నుంచే అంచనాలు మొదలైపోయాయి. దీనికితోడు మహేష్ బన్నీల అభిమానులు కూడ ఈ వార్ లో తమ హీరో సినిమా ఫలానా కారణాలతో విజయం సాధిస్తుందని కొన్ని విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. 

వాస్తవానికి గతంలో ఎప్పుడు బన్నీ సినిమా విడుదలైనా మెగా అభిమానుల సపోర్ట్ అల్లు అర్జున్ కు ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో బన్నీకి మెగా అభిమానుల మధ్య గ్యాప్ ఏర్పడటంతో అల్లు అర్జున్ ఎంత ప్రయత్నించినా మెగా అభిమానులు బన్నీ పై అసహనంతోనే ఉంటున్నారు. 

దీనితో ఈ అసహనం మహేష్ కు వరంగా మారుతుందా అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. దీనికితోడు మహేష్ చిరంజీవితో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగించడమే కాకుండా ‘సైరా’ మూవీ పై అల్లు అర్జున్ కంటే ముందు ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఇండస్ట్రీలో చిరంజీవి ఉన్నంత కాలం నెంబర్ వన్ స్థానం ఒక్క చిరంజీవి తప్ప మరెవ్వరికీ దక్కదని మహేష్ గతంలో ఓపెన్ గా చేసిన కామెంట్స్ మహేష్ ను మెగా అభిమానులకు మరింత దగ్గరకు చేర్చాయి.

అదేవిధంగా మహేష్ చరణ్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటమే కాకుండా నమ్రత ఉపాసనల మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది అన్నది ఓపెన్ సీక్రెట్. ఈ పరిస్థితుల నేపధ్యంలో మెగా అభిమానుల ఓటు సంక్రాంతి రేసులో మహేష్ కు మాత్రమే ఉంటుందని ఎట్టి  పరిస్థితులలోను మెగా అభిమానులు బన్నీని సంక్రాంతి విజేత అవ్వడానికి సహకరించారు అంటూ కొందరు ఒక కొత్త ప్రచారానికి తెర తీసారు. అయితే సాధారణ ప్రేక్షకుల మన్నలను పొందకుండా ఎంతమంది అభిమానులు సపోర్ట్ చేసినా ఆ మూవీ హిట్ కాదు అన్నది వాస్తవం..


మరింత సమాచారం తెలుసుకోండి: