నిరంతరం సోషల్ మీడియాలో సందడి చేసే రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన ఇన్ స్టా గ్రామ్ ద్వారానే అభిమానులతో టచ్ లో ఉంటోంది. అయితే తాను ఈ మధ్య ఇన్‌ స్టా గ్రామ్ కు అడిక్ట్ గా మారిపోయానని దీనితో తనకు ఏమి జరుగుతుందో అన్న భయంతో ఒక వారం రోజుల పాటు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తన ఇన్ స్టా గ్రామ్ లో తెలియ చేసింది. 

దీనితో రేణు దేశాయ్ కి ఏమైంది అంటూ ఆమె అభిమానులు ఖంగారు పడిపోతున్నారు. ప్రస్తుతం బుల్లితెర పై వస్తున్న ఢి షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మధ్య రైతుల సమస్యల పై ఒక మూవీని తెలుగులో తీయబోతున్నాను అంటూ ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే.  

రైతుల సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆమె తెలుగు రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ఒక సినిమా కథగా మార్చింది. అయితే ఆ తరువాత వచ్చిన పరిణామాలతో ఈ మూవీని తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాత రేణు దేశాయ్ తయారు చేసిన కథ నచ్చినా వేరే కారణాలతో బ్యాక్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. 

అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్ నటించే మూవీలో మొదట్లో ఒక కీలక పాత్రకు ఈమెను అనుకుని మళ్ళీ ఆ మూవీ దర్శక నిర్మాతలు వేరే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ఈ పరిణామాలతో నిరాశలోకి వెళ్ళి పోయిన రేణు సోషల్ మీడియాకు సెలవు ప్రకటించిందా లేదంటే దీనికి వేరే కారణాలు ఉన్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ వార్తలు తెలుసుకున్న పవన్ అభిమానులు కూడ తమ వదిన ఎందుకు ఇలా సెలవు తీసుకుంది అంటూ వారి స్థాయిలో వారు కారణాలు వెతుకుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: