తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ 87 రోజులు దాటింది.  ఇప్పటి వరకు ఇంటి వాళ్ల ముఖాలు, కింగ్ నాగార్జున ముఖాలు చూసిన ఇంటి సభ్యులు తమ బంధువులు రావడంతో ఒక్కసారే ఆనందంతో ఉబ్బి తబ్బిబై పోతున్నారు.  మొన్నటి నుంచి ఇంట్లో హూటల్ టాస్క్ పెట్టిన బిగ్ బాస్ ఒక్కో ఇంటి సభ్యుల బంధువులను పంపుతున్నారు.  అలీ రెజా భార్య తర్వాత శివజ్యోతి భర్త గంగూలీ తర్వాత బాబా భాస్కర్ భార్యా, పిల్లలను ఇంట్లోకి పంపారు. అంతకు ముందు వితిక చెల్లెలు వచ్చి సందడి చేసింది. తర్వాత వరుణ్ సందేశ్ బామ్మ ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


హౌస్ లోకి ఆమె ఎంటర్ అయిన దగ్గరనుండి హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూనే ఉన్నారు. తన మాటలతో అందరినీ మెస్మరైజ్ చేసింది బామ్మ. బిగ్ బాస్ ని తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది. కనీసం మీ ఫోటో అయినా పంపించండి బిగ్ బాస్ అంటూ బామ్మ అడగడం అందరికీ నవ్వు తెప్పించింది. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖ తల్లి లత వచ్చారు.  వచ్చీ రావడంతో శ్రీముఖి గట్టిగా ఎడ్వడం ఆరంభించింది. 


తర్వాత తల్లిని అందరికీ పరిచయం చేసింది.   అయితే లత మాట్లాడుతూ.. రాహుల్, శ్రీముఖి బయట స్నేహితులు కావడం, కానీ హౌస్ లోకి వచ్చి గొడవ పడుతుండడంతో తను చూడలేకపోతున్నానని చెప్పింది. అంతే కాదు మీరు ఇలా ఇంట్లో ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే బయట మీ పేరెంట్స్ ఎంత బాధ పడతారో ఆలోచించండి అంటూ రాహుల్ కి క్లాస్ తీసుకుంది.  ఇక రాహూల్ తల్లి కూడా రావడంతో అందరి బంధువుల వచ్చినట్లయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: