బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ కి శ్రీముఖి మధ్య గొడవలు ఉన్నాయని తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ చాలాసార్లు మాట్లాడుకున్నారు. శ్రీముకి అయితే నేనసలు జీవితంలో నీతో మాట్లాడనని చెప్పేసింది.వీరిద్దరి మధ్య గొడవ జరిగినపుడు ప్రేక్షకులు కూడా అసహనానికి గురయ్యారు. షో స్టార్టింగ్ నుండి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఏదో ఒక విషయంలో వీరిద్దరు పెద్దగా అరుచుకుంటూ తిట్టుకోవడం చాలాసార్లు చూశాం. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఇద్దరూ వారి పరువు పోగొట్టుకుంటున్నారని చాలా మంది భావించారు. 


అయితే గురువారం ఎపిసోడ్ లో హౌస్ కి గెస్ట్ గా వచ్చిన శ్రీముఖి అమ్మ రాహుల్ తో ఈ విషయమై మాట్లాడి కొన్ని విలువైన సూచనలు చేసింది. ముందుగా ఆమె రాహుల్ ని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తుందై అందరూ అనుకున్నారు. కానీ  శ్రీముఖి అమ్మ గారు చాలా నెమ్మదిగా సహృద్భావంతో నువ్వు నా కొడుకులాంటి వాడివని చెప్తూ, మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా..అందుకని  అరిచి పోట్లాడుకోవద్దని, ఏదైనా ఉంటే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలని, అంతే కానీ అరిచి గొడవ పెట్టుకోవడం మంచిది కాదని చెప్పింది.


మీరు గొడవ పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని టీవీలో చూసే మీ తల్లిదండ్రులమైనా మేము ఎక్కువగా బాధపడుతున్నాం. అందుకని అలా చేయకండి అని రాహుల్ ని విన్నవించింది. శ్రీముఖి అమ్మ మాటల ద్వారా ఇద్దరి మధ్య గొడవ జరిగినపుడు వాళ్ళెంత బాధపడి ఉంటారో అర్థం అవుతుంది శ్రీముఖి అమ్మగారు అలా చెప్పడం పట్ల రాహుల్ అభిమానులకి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. గొడవ ఇద్దరి వల్ల అవుతుంది కాబట్టి ఇద్దరికీ జాగ్రత్తలు చెప్తే బాగుంటుందని అంటున్నారు.  రాహుల్ తో పాటు శ్రీముఖికి కూడా ఈ విషయాలని చెప్తే మరింత బాగుండేదని రాహుల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: