వెళ్ళవయ్యా వేళ్ళు అంటూ నితిన్ తో స్టెపులేసిన హీరోయిన్ సదా ఎంతో పద్దతిగా సినిమాలు చేస్తూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే..  ఏజ్ పెరిగే కొద్దీ ఆమె పద్ధతి కూడా గాలికి వదిలేసింది. సినిమాలకు దూరంగా ఉన్న సదా టీవీ షోలలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె క్యూట్ గా ఉన్న కూడా ఆమెకు ఆఫర్లు కూడా రాలేదు. అయితే ఇప్పుడు సినిమాలలో నటిస్తుంది. 


ఇకపోతే.. టాలీవుడ్ లో అడల్ట్ సినిమాలు.. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని సినిమాలు హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ ను చవిచూశాయి. ఆ సినిమాలలో అమితమైన రొమాన్స్ ఉండటం వల్ల సినిమాలు ఆడవాళ్లకు నచ్చక పోవడంతో సినిమాలు చూడటమే మానేశారు. ఇది ఇలా ఉండగాసరైన ఆఫర్లు లేకపోవడంతో ఈ అమ్మడు రూటు మార్చుకుందనే చెప్పాలి. 



ప్రస్తుతం ఈమె ‘శ్రీమతి 21F’ చిత్రంలో వేశ్యగా మారింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. 90స్ లో తమిళనాడు - ఆంధ్ర హైవేలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఒక వేశ్య జీవితంలో జరిగిన యాదార్ధ సంఘటనల్ని సినిమాలో చూపిస్తున్నారు. ఆ ట్రైలర్ లో మొదట సదా రోడ్డు పక్కన నిల్చొని టార్చిలైట్ వేసి లారీలను ఆపే ఒక వేశ్య పాత్రలో ఆమె కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. 


పెద్ద హీరోయిన్ అయినా సదా బోల్డ్ గా నటించడమే కాదు ఆ పాత్రలో ఆమె ఉండనే ఫీల్ చేసిందనే ట్రైలర్ చుస్తే ఎవరికైనా అర్తమవుతుంది. జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?’.. అంటూ శృంగార సీన్లతో రెచ్చిపోయి నటిస్తోంది. ఒక వేశ్య బాధను ఈ పాత్ర ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ అశ్లీలత ఎక్కువగా ఉంది. వేశ్యలు ఇలా ఉంటారా అని అందరు నోటిఫై వేలేసుకొనే లా ఈ ట్రైలర్ ఉంది. గ్లామర్ ను మొత్తం చూపించిన సదా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఇకపోతే అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించగా.. ఏఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. వచ్చే నెల 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: