మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో మరోసారి చిరంజీవి తన సత్తా చాటాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాకు పెద్దగా టైం తీసుకోలేదు. కొరటాల శివ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.  


మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు అందుకున్న కొరటాల శివ చిరుతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఫైనల్ అవలేదు.


తెలుస్తున్న సమాచారం ప్రకారం అనుష్క, త్రిషా ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఫైనల్ అవుతారని తెలుస్తుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రాం చరణ్ చిరంజీవి యంగ్ పాత్రలో నటిస్తున్నాడట. ఈ సినిమాపై వస్తున్న ఈ వార్తలు మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నాయి.   


ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ తో పాటుగా మట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి కూడా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా బాలీవుడ్ నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. డిసెంబర్ లో మొదలుపెట్టి 2020 సమ్మర్ కల్లా ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  మరి వరుస హిట్లతో ఫాం లో ఉన్న కొరటాల శివ చిరుతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.    
 


మరింత సమాచారం తెలుసుకోండి: