‘రంగస్థలం’ మూవీ తరువాత మైత్రీ మూవీస్ కు ఒక్క హిట్ మూవీ కూడ తగల లేదు. వారు తీసిన సినిమాలు ఇంచుమించు అన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ తీవ్ర స్థాయిలో ఒడుదుడుకులను ఎదుర్కుంటోంది అని టాక్. ముఖ్యంగా టాప్ హీరోలతో వరసగా మూడు హిట్లు తీసిన ఈ నిర్మాణ సంస్థకు ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం ఈ మూవీ నిర్మాతలు చూపించిన అత్యుత్సాహం అన్న అభిప్రాయం కూడ ఉంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ భారీ నిర్మాణ సంస్థ పవన్ జూనియర్ మహేష్ లకు భారీ స్థాయిలో అడ్వాన్స్ లు ఇచ్చి వారికి కథలు వినిపించడానికి కొన్ని స్పెషల్ స్టోరీ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఈ ముగ్గురితో భారీ సినిమాలు తీసి మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ నిర్మాతలు నిన్న సాయంత్రం 5 గంటలకు ఒక కీలక ప్రకటన చేయబోతున్నాము అని ప్రకటించడంతో పవన్ జూనియర్ మహేష్ అభిమానులు వారి హీరోతో మైత్రీ మూవీస్ సినిమా చేయబోతోంది అని కలలు కన్నారు.

అయితే వీరిందరి ఆశల పై నీళ్ళు చల్లుతూ మైత్రీ మూవీస్ చేసిన కీలక ప్రకటన టాప్ హీరోల అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అనేక భారీ సినిమాలు తీసిన ఈ నిర్మాణ సంస్థ కొత్త నటీనటులతో ఒక వెరైటీ సబ్జెక్ట్ ను ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రాంభించ బోతున్నట్లు తెలియ చేసింది. 

వాస్తవానికి మైత్రీ మూవీస్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు కొత్త నటీనటులతో సినిమాలు తీయడం వల్ల ఆ సంస్థకు విపరీతమైన లాభాలు వచ్చే ఆస్కారం ఉంది. తమ సంస్థకు ఉన్న గుడ్ విల్ రీత్యా ఇలాంటి చిన్న సినిమాలను చాల భారీగా పబ్లిసిటీ చేసి పెద్ద స్థాయిలో చాల ఎక్కువ ధియేటర్లలో విడుదల చేసుకోగలుగుతారు. ఈ ప్రయోగం సక్సస్ అయితే టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న భారీ నిర్మాణ సంస్థలు అన్నీ టాప్ హీరోలకు హ్యాండ్ ఇచ్చి కొత్త వారితో సినిమాలు తీయడమే కాకుండా ఇండస్ట్రీకి మంచి టాలెంట్ ఉన్న నటీనటులను పరిచయం చేసే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: