సూపర్ స్టార్
మహేష్ బాబు ఇటీవల
భరత్ అనే నేను,
మహర్షి సినిమాలతో రెండు వరుస భారీ విజయాలు అందుకుని మంచి జోష్ తో ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మహేష్ సరసన
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్
విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్,
మురళి శర్మ బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, సంగీత, హరితేజ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
మహేష్ బాబు,
అజయ్
కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని రకాల కమర్షియల్ హంగులను కలగలిపి దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే
విజయశాంతి కూడా ఒక పవఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి ఏకే ఎంటెర్టైన్మెంట్స్,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల పై ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మహేష్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జనవరి 12న రిలీజ్ చేయాలని నిశ్చయించారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు
అనిల్ రావిపూడి దర్శకత్వ శైలి మరియు టైమింగ్ ఎంతో నచ్చిన
మహేష్ బాబు, ఆయనకు దర్శకుడిగా తనతో మరొక సినిమా చేసేందుకు అవకాశం కల్పించినట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. మరి, అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ అయి ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.....!!