‘సాహో’ షాక్ నుండి తేరుకుని ప్రభాస్ లండన్ లో జరగబోతున్న ‘బాహుబలి’ స్పెషల్ స్క్రీనింగ్ కోసం తన సన్నిహితులతో కలిసి ఇప్పటికే ప్రభాస్ లండన్ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అతడి సన్నిహితులతో కలిసి లండన్ లోనే జరుపుకుంటాడని తెలుస్తోంది. 

ఈసారి పుట్టినరోజును ఎటువంటి హడావిడి లేకుండా జరుపుకుంటూ ఆరోజు ప్రభాస్ జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో సరిపెడతాడని టాక్. ఇది ఇలా ఉండగా ప్రభాస్ కు ఇంకా ‘సాహో’ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సాహో’ షూటింగ్ సమయంలో ఈ మూవీ నిర్మాతలు ఒక ప్రముఖ బ్యాగ్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ‘సాహో’ మూవీలో ఈ కంపెనీ తయారు చేసిన బ్యాగుల్ని హీరో హీరోయిన్ల చేత వాడేలా చేస్తామంటూ ఆ బ్యాగ్ కంపెనీ యాజమాన్యం నుండి ‘సాహో’ నిర్మాతలు 1.38 కోట్లు తీసుకున్నట్లుగా ఆ కంపెనీ యాజమాన్యం లేటెస్ట్ గా ఆరోపణలు చేస్తోంది. 

తమ కంపెనీ బ్యాగ్స్ ను వాడకపోగా ఎలాంటి ప్రచారం చేయకుండా మోసగించినట్లుగా ఆ బ్యాగ్ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఇపుడు ఈ వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి ఈ మూవీ విడుదలై ఇంత కాలం అయిన తరువాత ఇప్పుడు ఈ బ్యాగ్ కంపెనీ ఎందుకు ఆలస్యంగా స్పందిస్తోంది అన్న ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. అసలే ‘సాహో’ షాక్ లో ఉన్న ప్రభాస్ కు లండన్ లో ఉన్నప్పటికీ ‘సాహో’ సమస్యలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉండటం ప్రభాస్ కు బయటకు చెప్పుకోలేని షాక్ అనుకోవాలి..     



మరింత సమాచారం తెలుసుకోండి: