ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో రష్మిక మందన్నకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అందరు హీరోయిన్లకు ఒక వైపు, తాను భిన్నం అన్నట్లుగా క్లీవేజ్‌ కి దూరంగా ఉంటూ గ్లామర్ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ "ఛలో" సినిమాతో తెలుగు సినిమా గడప తొక్కిన ఈమె "గీతగోవిందం" సినిమా ద్వారా మంచి మార్కులు సంపాదించింది. దీనితో రష్మికకు వరుస అవకాశాలు చాలా వస్తున్నాయి. ఇదే పరిస్థితులలో అక్కినేని నాగచైతన్య కూడా రష్మిక మందన్న వరుసలో ఉన్నాడట.


ప్రస్తుతం నాగ చైతన్య మంచి జోష్‌లో ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. తన గత సినిమా భార్య సమంతతో 'మజిలీ' రూపంలో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీ అయ్యాడు. ఓక వైపు మేనమామ వెంకటేష్‌తో 'వెంకీమామ' సినిమాలో నటిస్తూనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.


ఇప్పుడు నాగచైతన్య నటిస్తున్న "వెంకీమామ", శేఖర్ కమ్ముల చిత్రాలు షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటున్నాయి. శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబోలో రాబోతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది అంత ఇలా ఉంటే ఇంతలో రష్మిక మందన్నతో నాగచైతన్య కొత్త సినిమా చేస్తున్నాడని పేర్కొంటూ ఆ టైటిల్ కూడా రివీల్ కావడం అందరిలో కాస్త ఒకింత ఆశని రేకెత్తించింది.


కానీ హాట్ టాపిక్ గా నాగ చైతన్య, దిల్ రాజు కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి 'అదే నువ్వు అదే నేను' టైటిల్ కూడా పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాకి కొత్త దర్శకుడు శశి దర్శకత్వం వహించనున్నాడని సినీ వర్గాల సమాచారం. అయితే నాగ చైతూ సరసన హీరోయిన్ గా నటించేందుకు గాను రష్మిక మందన్నను దర్శక నిర్మాతలు సంప్రదించగా ఆమె తన నిర్ణయాన్ని సస్పెన్స్‌లో ఉంచిందని సమాచారం. దీంతో ఈ విషయం జనాల్లో చాలా హాట్ టాపిక్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: