ఈ మద్య టెలివిజన్ రంగంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వస్తున్నాయి. ఔత్సాహికుల్లో ఉన్న కళను బయటకు రాబట్టే ఎన్నో రియాల్టీ షోలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ తెలుగు చానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన డైలాగులు, హావభావాలతో అచ్చు నందమూరి బాలకృష్ణను తలపింప చేసే బాలనటుడు గోకుల్ బాగా పాపులర్ అయ్యాడు.

తాజాగా బుల్లితెర రంగంలో విషాదం నెలకొంది..డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశాడు. జీ తెలుగు చానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ లో గోగుల్ తనదైన ముద్ర వేసుకున్నాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన గోకుల్ డ్రామా జూనియర్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సింహా’ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులను అవలీలగా చెప్పేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతే కాదు తన హావభావాలు.. బాలకృష్ణ మేనరిజంతో ఆకట్టుకున్నాడు.

ఈ ప్రోగ్రామ్ తో గోగుల్ జూనియర్ బాలయ్యగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా గోకుల్ లేడని తెలియడంతో బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.  తమకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదని, అలాంటిది చిన్నారి అభిమాని గోకుల్ మృతి తన మనసును కలచివేస్తోందని తెలిపారు.  ఇంత చిన్న వయసులో డెంగ్యూ కారణంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం అత్యంత బాధ కలిగిస్తోందని..ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాని..వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: