మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' సినిమా తో అద్భుతమైన విజయం అందుకని మంచి జోష్ మీద ఉన్నారు. దేశ స్వాతంత్ర పోరాట యోధుడు తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పేరు, ఖ్యాతి ఎల్లలు దాటే విధంగా చిరంజీవి 'సైరా' సినిమా హిట్ అయ్యాక..రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులను మరియు అదే విధంగా ఢిల్లీలో ఉండే పెద్దలను కలవడం జరిగింది. సినిమా హిట్ అవ్వటం విజయం సాధించిన తరువాత కూడా కేవలం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగువాడు...దేశం కోసం పోరాడిన వాడు అన్న ఉద్దేశంతో ఆయనకు మంచి పేరు తీసుకురావడానికి ఆయన కీర్తి ప్రతిష్టలు పెంచడానికి చిరంజీవి 'సైరా' సినిమా హిట్ అయ్యాక ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన వ్యవహరించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.


ముఖ్యంగా చాలా కాలం తర్వాత చిరంజీవి ఇంద్ర తరహాలో సైరా సినిమాతో విజయాన్ని సాధించడంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు సైరా సినిమా కి టైం కేటాయించడంతో కొరటాలతో చేయబోయే సినిమా త్వరగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇటీవల దసరా సందర్భంగా కొరటాల సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన చిరంజీవి...డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేయటానికి రెడీ అయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. అంతే కాకుండా ఈ సినిమా పూర్తి కామెడీ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ సందేశాత్మక పూర్వకంగా చిత్రీకరించనున్నట్లు సమాచారం.


'సైరా' సినిమా నిర్మించిన నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ కొరటాల సినిమాని నిర్మించబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ మరియు రామ్ చరణ్ కలిసి ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భంలో చార్లీ చాప్లిన్ పక్కన ఇద్దరి ఫోటోలు దిగి పోస్ట్ చేయడం జరిగింది. దీంతో కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి మెగాస్టార్ చిరంజీవిని..డైరెక్టర్ కొరటాల చూపించబోతున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: