టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే, ఆ సినిమా పెద్దగా ఆడనప్పటికీ, హీరోయిన్ గా తన అంద చందాలతో తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకుంది అనే చెప్పాలి. ఆ తరువాత హీరో వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ గా వచ్చిన ముకుందలో నటించిన ఈ భామ, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కొంత నిరాశ చెందింది. ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న పూజ, ఇటీవల వరుస విజయాలతో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఆమె చేతిలో చాలానే బడా సినిమాలు ఉన్నాయి. 

మరికొందరు సినిమా నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెయిటింగ్ లో కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సినిమా, అఖిల్ మరియు బొమ్మరిల్లు భాస్కర్ ల కాంబో సినిమాతో పాటు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న జాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నేడు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన లైఫ్ లో ఇప్పటివరకు నటించిన సినిమాల్లో జాన్ సినిమాలోని పాత్ర వన్ ఆఫ్ ది బెస్ట్ అని అంటోంది పూజా. 1970ల కాలం సయమంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ స్టోరీ, తప్పకుండా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటోంది కూడా చెప్తోంది. ఇక హీరో ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని, ఆయన ఎంతో టాలెంటెడ్ మరియు ఫన్నీ పర్సన్ అని, 

ఇక సెట్లో ఆయన ఉన్నంతసేపు ఎంతో సందడిగా ఉంటుందని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ మంచి ఫుడీ అని, సెట్ లోని వారందరికీ రోజూ ఎంతో రుచికరమైన భోజనాలు ఇంటినుండి తయారు చేయించి తెప్పిస్తారని, ఆయనతో మళ్ళి మళ్ళి పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్తోంది ఈ భామ. ఇక పూజ చేసిన ఈ వ్యాఖ్యల తరువాత జాన్ సినిమా కథ, ఒక మంచి లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు మనకు కొంత అర్ధం అవుతుంది. మరి ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: