టాలీవుడ్ ప్రముఖ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమా షూటింగ్ లో జరిగిన ఓ విషయాన్ని గురించి వివరించారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగుతున్న కొత్తలో 'అల్లరి రాముడు' సినిమా షూటింగ్ పాలకొల్లు లో జరుగుతుంది. ఆ సందర్భంలో నేను కూడా ఉన్నాను అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సందర్భాన్ని గుర్తు చేసుకుని...పరుచూరి గోపాలకృష్ణ వీడియో లో ఇంకా మాట్లాడుతూ... షాట్ గ్యాప్ లో మేము చినరామయ్య(ఎన్టీఆర్) తో మాట్లాడుతూ.. మీరు ఫ్యామిలీలో అందరితో మాట్లాడతావా అని అడిగాం.


దీంతో వెంటనే ఎన్టీఆర్ కళ్ళలో నీళ్లు కనిపించాయి. ఏడుస్తూనే.. లేదండీ.. అందరి అభిమానుల్లాగే నాకు కూడా బాబాయ్(బాలకృష్ణ) అంటే ప్రాణం. అభిమానులు బాబాయ్ ని చూసి ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తారో అదే ప్రేమ నాలో కూడా ఉంది అని ఏడ్చాడు. మేము ఫోన్ కలిపి ఇస్తాము మీ బాబాయ్ తో మాట్లాడు అని చెప్పాం. ఎన్టీఆర్ ఏడుపు ఇంకా ఎక్కువైంది. బాలయ్యకు ఫోన్ చేసి ఎన్టీఆర్ తో మాట్లాడండి అని అడిగాం.. ఆ ఇవ్వండి అని బాలయ్య అన్నారు.. ఎన్టీఆర్ మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు.. బాలయ్య వాడేందుకు అలా ఏడుస్తున్నాడు.. మీరైనా చెప్పండి అని బాలయ్య అన్నారు.


నాకు తెలిసి బాలయ్య, ఎన్టీఆర్ మాట్లాడుకోవడం అదే తొలిసారి. వీరిద్దరూ ఒకే వేదికపైన కనిపించాలని మేము అప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ తరువాత అల్లరి రాముడు సినిమా పూర్తి అయిన అదృష్టవశాత్తు ఓ అవార్డ్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ వద్దకు తీసుకెళ్ళింది మేమే అంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో వేదికపై బాలకృష్ణ మెడలో దండ వేయమని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: