తనుశ్రీ దత్తా..బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా ఫేమస్ అయిన ఇమ్రాన్ హష్మీ తో కలిసి నటించిన మొదటి సినిమాతోనే హాట్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆషిక్ బనాయా ఆప్నే సినిమాలో ఇమ్రాన్ తో చేసిన రొమాన్స్ జనాలకి ఇప్పటికి మర్చిపోలేరు. ఇక బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనతో ఓ సినిమా సెట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి మీటూ ఉద్యమానికి తెర లేపింది తనుశ్రీ దత్తా. దాదాపు పదేళ్లుగా ఆమె బాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు తనకు మళ్లీ నటించాలని ఉందని అన్నారు. అది కూడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందని మీడియా ద్వారా తన మనసులో ఉన్న ఆశను బయటపెట్టారు. 

 సినిమాల్లో నటించి 10 సంవత్సరాలైంది. మళ్లీ నటించాలనుంది. అందుకే సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. నేను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాలు చూశాను. ఆయన సినిమా మేకింగ్, తీస్తున్న సినిమాలు నాకు చాలా నచ్చుతాయి. నాలాంటి హీరోయిన్‌ కి ఆయన అవకాశం ఇస్తారో లేదో తెలీదు. కానీ నాకు మాత్రం ఆయన సినిమాలో నటించాలని ఉంది. నాకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి భన్సాలీ అంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన లాంటి దర్శకుడితో కలిసి పనిచేయాలంటే ఆడిషన్స్‌కు వెళ్లడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే సినిమాలో బిజినెస్ యాంగిలే ఎక్కువగా ఉంటుంది. 

నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అందరు దర్శకులతో నటించాలని కలలు కనేదాన్ని. కానీ కుదరకపోవడంతో ఆలోచించడం మానేశాను. దాని వల్ల బాధ తప్ప ఏమీ మిగలదు. నాకు మేనేజ్‌మెంట్ టీం కూడా లేదు. కాబట్టి నన్ను ఎవరు సంప్రదించాలనుకుంటున్నారో కూడా తెలీదు. ఈసారి అవకాశం వస్తే ఏదన్నా మంచి ప్రాజెక్ట్‌లో నటించాలని ఉంది అని తనలోని ఆలోచనలన్ని ఒక్కసారిగా వెల్లడించింది. అందం తో పాటు అభినయం కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఛాన్సులిస్తారేమో చూడాలి. తనుశ్రీ దత్తాకు సినిమా వల్ల అంతగా పాపులారిటీ రాలేదు. అయితే తను ఎప్పుడైతే నానా పటేకర్ వల్ల కలిగిన ఇబ్బంది గురించి బయటపెట్టిందో ఆ దెబ్బతో ఇండియాలో ఆమె పేరు మారుమోగిపోయింది.  
  

మరింత సమాచారం తెలుసుకోండి: