సౌత్ ఇండియాలో దశాబ్దం పైగా స్టార్ డమ్ అనుభవించిన హీరోయిన్ ఎవరు అంటే త్రిష అనే చెప్పాలి. 2003లో నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా తెలుగు, తమిళ్ లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది త్రిష. 2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ్ లో కలిపి సినిమాలు చేస్తూ ఒక దశలో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణీ అయింది. అందం, అభినయం రెండింటిలో త్రిష స్పెషల్.

 


దాదాపు దశాబ్దకాలంపైగా హీరోయిన్ గా సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఏలేసిన త్రిషకు కొత్తవారి రాకతో అవకాశాలు తగ్గాయి. గతేడాది తమిళ్ లో విజయ్ సేతుపతితో కలిసి చేసిన 96 మూవీ సూపర్ హిట్ అయి ఇంకా తాను రేస్ ఉన్నానని చెప్పింది. ఇప్పుడు మళ్లీ త్రిష దశ తిరిగినట్టే కనిపిస్తోంది. ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కి ఈ చెన్నై చంద్రం సైన్ చేసినట్టు సమాచారం. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న 152వ సినిమాలో త్రిషనే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. తమిళ్ లో స్టార్ డైరక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిషను ఇప్పటికే సెలక్ట్ చేశారు. మళయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్. దీంతో చాన్నాళ్ల తర్వాత త్రిష హవా మొదలుకాబోతోందని సౌత్ సినీ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.

 


దక్షిణాది భాషల్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో తో త్రిష నటించింది. వయసు ముప్పైల్లో ఉన్నా తరగని అందంతో త్రిష తన బ్యూటీని కాపాడుకుంటోంది. దీంతో ఇప్పుడు సీనియర్ హీరోలకు త్రిష బెస్ట్ ఆప్షన్ కాబోతోందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: