టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కొన్నాళ్ల క్రితం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాల అద్భుత విజయాల తరువాత యావత్ భారత దేశం అంతటా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగింది. ఇక ఆ సినిమాల సక్సెస్ తరువాత ప్రభాస్ క్రేజ్ తో పాటు మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవల యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటించిన ప్రభాస్, ఆ సినిమాతో బిలో యావరేజ్ విజయాన్ని మాత్రమే దక్కించుకోగలిగారు. అత్యంత భారీ ఖర్చుతో, 

అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఆ సినిమాలో కథ మరియు కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో లేకపోవడంతో, మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించలేదు. ఇకపోతే నేడు, ఆయన నటించిన బాహుబలి సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రత్యేకంగా ప్రదర్శన కానున్న సందర్భంగా దర్శకుడు రాజమౌళి, రానా, కీరవాణి, సెంథిల్ కుమార్, అనుష్క సహా హీరో ప్రభాస్ కూడా లండన్ చేరుకున్నారు. ఇక ఈ షో ప్రదర్శన తరువాత లండన్ లోనే ప్రభాస్ కొద్దిరోజులు స్టే చేయబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. 

ఇక ఈ నెల 23న తన బర్త్ డే ఉండడంతో, బాహుబలి యూనిట్ సభ్యులకు అక్కడే ప్రభాస్ పెద్ద పార్టీని ఇవ్వనున్నారని, అలానే ప్రస్తుతం నటిస్తున్న జాన్ తరువాత, తన తదుపరి చేయబోయే సినిమాను ఆ సందర్భంగా సంచలన ప్రకటన చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే అది రాజమౌళి దర్శకత్వంలోనే ఉంటుంది అనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది. మరి ప్రభాస్ తన జన్మదినం నాడు ఎటువంటి ప్రకటన చేస్తారో చూడాలని ఫ్యాన్స్ అందరూ ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: