టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన సైరా నరసింహారెడ్డి మూవీతో యావరేజ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మెగాస్టార్ ఒక స్వాతంత్రోద్యమ వీరుడిగా నటించిన ఈ సినిమాలో, నయనతార హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, సుదీప్, రవి కిషన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క శెట్టి, నిహారిక కొణిదెల తదితరులు ఇతర పాత్రల్లో నటించడం జరిగింది. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. 

ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఇక ఇటీవల ఎంతో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుని, అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే అడ్డంకులు మొదలైనట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తన సినిమాలకు ఎప్పుడూ తీసుకునే దేవిశ్రీప్రసాద్ నే తీసుకోవాలని కొరటాల భావించారట. అయితే ప్రస్తుతం దేవికి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఆయన అందుబాటులో ఉండడం లేదని తెలియడంతో మరొక సంగీత దర్శకుడి వేటలో పడ్డారట. 

అంతేకాక ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఒక నటిని ఎంపిక చేయడం జరిగిందని, అయితే ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా సినిమాలో నటించలేనని చెప్పిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే ఈ విధంగా ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మెగాస్టార్ సినిమాకు అడ్డంకులు వస్తుడడంతో కొందరు మెగాఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: