కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొంతకాలం క్రితం వరకూ ఫ్యామిలీ మూవీస్ తీయడంలో సిద్ధహస్తుడనే పేరు ఉండేది. అదే కాన్సెప్ట్ తో ఆయన తీసిన బ్రహ్మోత్సవం సినిమా మహేశ్ కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి. ఈ సినిమాతో శ్రీకాంత్ తో సినిమా తీసేవాళ్లు దూరమయ్యారు. వెంకటేశ్, మహేశ్ ల మల్టీస్టారర్ తో ఎంత పేరు తెచ్చుకున్నాడో బ్రహ్మోత్సవంతో అంత వెనుకబడిపోయాడు.

 


కొంతకాలంగా కొత్త సినిమాలు తీయని శ్రీకాంత్ కు ఓ మెగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. తాను ఇంట్రడ్యూస్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే కథను వరుణ్ కు వినిపించాడని నాగబాబు కూడా ఈ కథపై నమ్మకంతో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. వరుణ్ ను పరిచయం చేసిన ముకుంద సినిమా మంచి సినిమా అనిపించుకున్నా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ఈ సినిమాతో వరుణ్ పరిచయమయ్యాడే కానీ ఎటువంటి గ్రోత్ ఈ సినిమాతో లేదు. కానీ నాగబాబు మరోసారి శ్రీకాంత్ అడ్డలపై నమ్మకముంచాడని అంటున్నారు. శ్రీకాంత్ కూడా ఈసారి ఎలాగైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడట.

 


ఈ వార్తలన్నీ నిజమైతే వరుణ్ తో వచ్చే ఏడాదే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. సరైన కథతో వస్తే శ్రీకాంత్ హిట్ సినిమా తీస్తాడనే పేరు ఇప్పటికీ టాలీవుడ్ లో ఉంది. ఆమధ్య ఓసారి దిల్ రాజు మాట్లాడుతూ.. కొత్త బంగారులోకం తెచ్చిన లాభాలు చాలా ఎక్కువని తనకిష్టమైన సినిమాల్లో కొత్త బంగారులోకం ఒకటని చెప్పుకొచ్చాడు. కాబట్టి శ్రీకాంత్ తన బ్రాండ్ కు తగ్గ కథను సిద్ధం చేసుకుంటే తిరిగి తన హవా కొనసాగించే అవకాశాలు పుష్కలం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: