తెలుగులో టాప్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా అంటే గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండా హీరోగా నటించగా , శాలిని పాండే హిరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా హిట్ అవ్వడంతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నారు. 



ఇకపోతే హిరోయిన్ కు మాత్రం ఈ సినిమాలో మంచి పేరు వచ్చిన కూడా సరైన అవకాశాలు రాలేదు ఇకపోతే ఈమె వచ్చిన అవకాశాలను అందుకుంటూ వస్తున్న ఈ అమ్మడుకు మారె సినిమా హిట్ ను అందించలేదని చెప్పాలి. కాగా, నందమూరి కళ్యాణ్ నటించిన 118 సినిమాలో ఈమె నటించింది. అయితే ఆ సినినా హిట్ అవ్వడంతో మరి కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. 



ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి అయితే ఆ సినిమాలకు ఒప్పుకున్న అమ్మడుకు బాలీవుడ్ లో సినీ అవకాశాలు వచ్చి పడటంతో అక్కడికి వెళ్తుందని వార్తలు వినపడుతున్నాయి. అనుష్క నటిస్తున్న నిశబ్దం సినిమా నటించే ఆకాకాశం వచ్చిన కూడా ఈ అమ్మడు పక్కన పెట్టేసింది. చాలా సినిమాలకు దూరంగా కూడా ఉందట..




మరో విషయమేమిటంటే.. అమ్మడు తన మేనేజర్ ఫోన్ కూడా ఎత్తడం లేదనే టాక్ వినపడుతోంది. ముందు కమిట్ అయిన సినిమాలు కూడా ఈ అమ్మడు ఇబ్బందులు పెడుతుంది. నిర్మాతలు అందరూ సినీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని ఆలోచనలు సారిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఇద్దరి లోకం ఒకటే రాజ్ తరుణ్ సినిమాలో నటిస్తోంది. దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: