ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన హీరోయిన్ లో నిధి అగర్వాల్ ఒకరు .బాలీవుడ్  తెరంగ్రేటం చేసిన హీరోయిన్ అక్కడ మొదటి సినిమా మున్నా  మైఖేల్  లో టైగర్ ష్రాఫ్ సరసన నటించింది. తర్వాత తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన సవ్యసాచి లో నటించింది ఆ తర్వాత ఆయన తమ్ముడితో MR.మజ్ను సినిమా లో  నటించింది ఈ రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీనితో టాలీవుడ్ లో ఆమె పై ఐరన్ లెగ్  ముద్ర పడింది

అయితే ఎట్టకేలకు రామ్ తో నటించిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ సక్సెస్ సాధించడం వల్ల. ఈ అమ్మాయి ఒక వైపు అవార్డ్ ఫంక్షన్ మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో బిజీ బిజీ గా కనిపిస్తూ ఉంది. ఈమధ్య  ఖతార్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో ఈ అమ్మడు డాన్స్ ఇరగదీసింది. నిజానికి 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత తెలుగులో బాగానే అవకాశాలు వచ్చాయి.

కానీ ఏది తీసుకోవాలని సందేహంలో ఉన్నట్లు తెలుస్తుంది కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి.ఇంకో వైపు ఒక పెద్ద సినిమాకు సైన్ చేసిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న ఆ విషయం పై ఈ అమ్మడు మాత్రం ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు .

మరోవైపు ఇస్మార్ట్ శంకర్ తో మరో హీరోయిన్ నభ నటేష్  కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు మాత్రం రవితేజతో మరియు సాయిధర్మ తేజ తో రెండు సినిమాలు చేస్తూ ఉంది. ఈ మధ్యన ఒక కారు కూడా కొనేసింది. కానీ నిధి అగర్వాల్ మాత్రం ఇంకా స్క్రిప్ట్  మీద కూర్చొని ఉంది నిధి అగర్వాల్ నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు ఏమో.


మరింత సమాచారం తెలుసుకోండి: