బిగ్ బాస్ లో ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఈ వారం నామినేషన్ మొత్తం ఏడుగురు సభ్యులున్నారు. బిగ్ బాస్ చరిత్రలో హౌస్ మెంబర్స్ మొత్తం నామినేషన్ లో ఉండడం ఇదే మొదటిసారేమో! నామినేషన్ లో ఉన్న ఏడుగురు సభ్యులలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ఒక్కసారి ఈ ఏడుగురిని పరిశీలిస్తే, మొదటగా రాహుల్ సేవ్ అవుతాడని అనిపిస్తుంది. టాస్క్ లలో సరిగా పర్ ఫార్మ్ చేయకపోయినా రాహుల్ కి ఫాలోయింగ్ చాలానే ఉంది.


ఇక బాబా భాస్కర్, శ్రీముఖిలు హౌస్ లో బాగా ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్నారు. వీరిద్దరికీ ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా శ్రీముఖి యాంకర్ గా చేసింది కావున టీవీ అభిమానులు ఆమె వైపే మొగ్గు చూపుతున్నారు. అదీ గాక ఆమె టాస్క్ లలో వందశాతం ఎఫర్ట్ పెడుతుంది. అందువల్ల బాబా భాస్కర్, శ్రీముఖిలు సేఫ్ అవుతారని అనిపిస్తుంది. ఇక ఆలీ, ఆలీకి మొన్నటి వరకు సరైన ఓటింగ్ లేదనే టాక్ వచ్చింది.


కానీ సడెన్ గా ఓటింగ్ లో టాప్ నుండి సెకండ్ ప్లేస్ ఉన్నాడని టాక్. ఇక మిగిలింది ముగ్గురు. ఈ ముగ్గురిలో వరుణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. హీరో కాబట్టి అతన్ని అభిమానించేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఆటలో అతని జెన్యూనిటీ చాలా మందికి నచ్చుతుంది. దాంతో వరుణ్ కూడా సేఫ్ అయిపోతాడు. ఇక డేంజర్ జోన్ లోకి వచ్చినవారు వితికా, శివజ్యోతి. ముందుగా వితికా విషయానికొస్తే, ఆమెకి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ లేదు. వరుణ్ ని అభిమానించే వారు వితికాకి ఓటేస్తారు.


కానీ ఈ సారి వరుణ్ కూడా నామినేషన్ లో ఉండడంతో అంతా వరుణ్ వైపే మొగ్గు చూపుతున్నారు. దానివల్ల వితికాకి నష్టం వాటిల్లనుంది. శిఅజ్యోతికి ఫ్యాన్ బేస్ ఎంత ఉందనేది తెలియదు. నామినేషన్ లోకి వచ్చి చాలా రోజులవుతున్న కారణంగా ఆమెకి బయట ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది చెప్పలేం. అయితే ఆమె ఏడుపు ఆమెకి చాలా నష్టాన్నే తెచ్చేలా ఉంది. మొత్తానికి ఈ వారం వితికా శివజ్యోతిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ గనక ఉంటే వీరిద్దరూ వెళ్ళిపోతారని అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: