టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట కథ మరియు మాటల రచయితగా ప్రవేశించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, తన ఆకట్టుకునే విభిన్నమైన పంచ్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల మదిని దోచారు. తొలిసినిమా నువ్వే నువ్వే నుండి ఇటీవల ఆయన తీసిన అరవింద సమేత వరకు కొన్ని హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా చవిచూసిన త్రివిక్రమ్ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా సినిమా అల వైకుంఠపురములో సినిమాను తీస్తున్నారు త్రివిక్రమ్. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, 

అక్కినేని సుశాంత్ మరియు నివేత పేతురాజ్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు సామజవరగమనా అనే సాంగ్ ప్రేక్షకుల నుండి ఎంతో మంచి స్పందన సాధించి, సినిమా పై అమాంతం అంచనాలు పెంచాయి. ఇకపోతే జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయమై దర్శకుడు త్రివిక్రమ్ కు కొన్ని తలనొప్పులు మొదలయ్యాయని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నిజానికి అదే రోజున మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో, తమ సినిమాకు దాని వలన కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందని, 

తొందరపడి సినిమా డేట్ ముందే అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది అని భావిస్తున్నారట. ఇప్పటికే గతంలో పవన్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమాతో భారీగా దెబ్బతిన్న త్రివిక్రమ్, ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతుండడంతో, ఒకవేళ తమ సినిమా కొంచెం అటు ఇటు అయితే ఎంతో దారుణమైన ప్రభావాన్ని చూడవలసి వస్తుందని లోలోపల కొంత మధన పడుతున్నట్లు సమాచారం. మరోవైపు సరిలేరు సినిమా నిర్మాతలు కూడా తమ సినిమా డేట్ ను మార్చేలా లేరని వినికిడి. మరి ఒకే రోజు రాబోతున్న ఈ రెండు సినిమాలు ఎంత మేర విజయాన్ని అందుకుంటాయో చూడాలి......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: