వరుస విజయాలతో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమా లతో అందుకున్న విజయాలతో కెరియర్ పరంగా మంచి ఊపు మీద ఉన్న మహేష్ బాబు. ఇదిలా ఉండగా మహేష్ బాబు చివరిగా నటించిన సినిమా ‘మహర్షి’ మహేష్ కెరీర్లోనే 25వ సినిమాగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇన్ని రికార్డులు ఇంత విజయాన్ని సొంతం చేసుకున్న మహర్షి సినిమా నీ జెమినీ సంస్థవారు టెలివిజన్ శాటిలైట్ రైట్స్ దక్కించుకొని బుల్లితెర పైకి తీసుకువచ్చారు.


దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో కలెక్షన్ల పరంగా అనేక రికార్డులు సృష్టించడంతో బుల్లితెరపై 15 నుండీ 20 వరకూ టీఆర్పీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా జెమిని వారికి మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మహర్షి చిత్రం అర్బన్ మరియు రూరల్ కలిపి యావరేజ్ గా 8.4 టీఆర్పీ మాత్రమే వచ్చింది. జెమిని టీవీ భారీగా ప్రమోట్ చేసి మరీ ఎక్కువగా పోటీ లేని సమయంలో ప్రసారం చేసినా ఫలితం లేకుండా పోయినట్లు సమాచారం. దీంతో అంచనాలకు మించి టిఆర్పి రేటింగ్ వస్తుందని భావించి జెమిని సంస్థ వారికి మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది.


పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో టెలివిజన్ రంగంలో మహర్షి సినిమా ఏ రికార్డును అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవరు అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: