టాలీవుడ్ లో మైత్రి మూవీమేకర్స్,అంటే మంచి సినిమాలకు ప్రసిద్ధి.ఇప్పుడు ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లో,మైత్రి మూవీమేకర్స్ కూడా ఒకటి అని చెప్పుకొచు.అలాంటి మైత్రి ప్రొడక్షన్ నుండి,పాలానా సినిమా వస్తుంది అంటేనే,కచ్చితంగా బంపర్ హిట్ అవుతుంది అనేలా పేరు తెచ్చుకున్నారు మైత్రి ప్రొడక్షన్ హౌస్ వారు.ఇప్పటివరకు మైత్రి మూవీస్ హౌస్లో నుండి వచ్చిన,మొదటి మూడు చిత్రాలు కూడా టాలీవుడ్ రికార్డ్స్ ని బద్దలుకొట్టాయి.మహేష్ తో శ్రీమంతుడు,జూనియర్
ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ ,మొన్నఈ మధ్య రిలీజ్ అయిన చరణ్ నటించిన,రంగస్థలం లాంటి బిగ్ బ్లాక్ బ్లాస్టర్స్ తో ఇప్పుడు,టాలీవుడ్ లో మైత్రి మూవీస్ ఒక్క ప్రత్యేకమయిన స్థానం సంపాదించుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.
ఆ మధ్య మైత్రి మూవీస్ సంస్థకి చెందిన నవీన్,తాజాగా తాము జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాం అని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోయే ఈ సినిమాకి కెజిఎఫ్ సినిమా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం కూడా వహిస్తునట్టు ప్రకటించారు,కానీ అది కొన్ని కారణాలు వల్ల జరగకపోవటంతో ,నందమూరి ఫ్యాన్స్ కొంచెం నిరాశకి లోనైయ్యారు.అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనం కూడా సృష్టించింది.
అలాగే మొన్న జనసేన అధ్యక్షులు అయిన పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇక సినిమాలకి గుడ్ బై అని,తన ఫోకస్ ఇక పూర్తిగా రాజకీయాలవైపే మొత్తం అని చెప్పారు. అలాంటి సందర్భంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ అయిన హరీష్
శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమా తొందర్లో రాబోతుంది అంటూ, తెగ హైప్ క్రియేట్ చేసారు. పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాలతో బిజీ అవుతున్నారు అంటూ,మెగా ఫ్యాన్స్ తమ దేవుడిని మళ్ళి తెరమీద చూసుకునే అవకాశం వస్తుంది అని చాలా పొంగిపోయారు.కానీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ పూర్తిగా కొత్త వారితో ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తుండటంతో అటు మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ మైత్రి మూవీమేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.