మొన్న ఆ మధ్య తమిళంలో రిలీజ్ అయ్యి,సూపర్ హిట్ కొట్టడమే కాకుండా అటు విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమా
విక్రమ్ వేద. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించగా,ప్రధాన పాత్రల్లో
మాధవన్ మరియు సేతుపతి
విజయ్ నటించారు.ఈ సినిమా విడుదలైన అప్పటి నుండి నేటి వరుకు,ఇతర భాషలలో రీమేక్ చేయటానికి ఫిలిం మేకర్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో రీమేక్ కి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి,కానీ హిందీలో మాత్రం రీమేక్ చేసే దిశలో ప్రయత్నాలు వడివడిగా సాగుతున్నాయి.ప్రస్తుత్తం బాలీవుడ్ లో
విక్రమ్ వేద సినిమా రీమేక్ కు ఇద్దరు బడా స్టార్లు సెట్ అయ్యారని తెలుస్తుంది.
ఈ సినిమా రీమేక్,హిందీలో నటించేందుకు,ఇద్దరు పెద్ద బాలీవుడ్ స్టార్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రలో,మరియు మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించేందుకు ఒప్పుకున్నారని ముంబై మీడియాలో టాక్ వినిపిస్తుంది.ఈ చిత్రానికి అసలు సినిమా దర్శకుల అయిన పుష్కర్ గాయత్రి కూడా దర్శకత్వం వహిస్తున్నారు అని,హిందీ వెర్షన్ రీమేక్ కు సంబందించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని చెప్పారు.
బాలీవుడ్ లో ఇప్పుడు భారీ మార్కెట్ ఉన్న హీరోలలో ఆమీర్ ఖాన్ మరియు సైఫ్
అలీ ఖాన్ అని చెప్పచు.వాళ్ళ సినిమాల సక్సెస్ రేట్ కూడా ఎక్కువే అని చెప్పచు.ఈ సినిమాలో వీళ్లిద్దరు నటించడంతో హిందీ వెర్షన్ పై భారీ ఆసక్తి నెలకొంటుంది. ఆమిర్ ఖాన్ ,సైఫ్
అలీ ఖాన్ ఇదివరకే కలిసి నటించారు. దిల్ చాహతా హై సినిమాలో ఇద్దరూ కలిసి నటించి,మెప్పించారు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ పై హిందీ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి కలిగిస్తుంది అని అంటున్నారు సినీ వర్గాలు.