రాగల 24 గంటల్లో అనే సినిమాతో మన తెలుగు భామ  అయిన ఈషా రెబ్బా ప్రేక్షకులను పలకరించనుంది.ప్రస్తుతం తాను నటించిన ఈ రాగల 24 గంటల్లో అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న సంగతి ఇప్పటికే అందరికి తెలుసు.ఈషా తన కెరీర్లో  తొలిసారిగా నటిస్తున్న,లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది,ఇలాంటి క్యారెక్టర్ తన కార్ర్ర్ లో,ప్రధమంగా చెయ్యటం ఒక విశేషం.టాటా బిర్లా మధ్యలో లైలా,అదిరిందయ్యా చంద్రం,ఢమరుకం లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం చేసారు.

అతి త్వరలో రిలీజ్ కానున్న రాగల 24 గంటల్లో సినిమాకు,మొన్న ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు చిత్రం యూనిట్.రెబ్బా ప్రమోషనల్  వీడియో సాంగ్ అనే పేరుతో   ఒక వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా రఘు కుంచె చేసారు.ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా,సాంగ్ లిరిక్స్ అటు క్లాస్ మరియు మాసు ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి అంటున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె తానే స్వయంగా ఈ పాటను పాడి ఆలపించారు.ఈ పాటను చాలా ఫన్నీగా డిజైన్చేసి నట్టు తెలుస్తుంది.

పాట ప్రారంభంలోనే  రేడియోలో వినిపించే విధంగా ఆకాశవాణి.వార్తలు చదువుతున్నది పాల్..మీ అభాస్ పాల్.ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాగల 24 గంటల్లో పెను తుఫాను రానున్నది అని,కావున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళకూడదు అని,చేపలే ఒడ్డుకు వచ్చి చేరుతాయని,వాతావరణ శాఖ వారు  హెచ్చరిస్తోంది.. అంటూ కృష్ణ భగవాన్ పబ్ లో ఒక ఫన్నీ ఇంట్రో సీన్ తో ఉంది.నెక్స్ట్ ఇక పాట మొదలు అవుతుంది.

పాటలో సత్యదేవ్,గణేష్ వెంకటరామన్ మరియు సంపూర్ణేష్ బాబు తమ శైలిలో స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తునట్టు స్పష్టం అవుతుంది.ఇందులో ముఖ్యంగా మన బర్నింగ్ స్టార్ సంపూ స్టెప్పులు ప్రేక్షకులని అందరినీ ఆకట్టుకునేలా రూపుదిద్దారు అని అంటున్నారు చుసిన వారంతా.మొత్తానికి 'రాగల 24 గంటల్లో' సినిమా ప్రమోషన్స్ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారని అంటున్నారు.ఇంకెందుకు ఆలస్యం,త్వరగా మన ఈషా రెబ్బా సాంగ్ ను చూసి మీరు ఎంజాయ్ చేయండి అంటున్నారు చిత్ర యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: