ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కువగా అడల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. వారానికి ఒకటో రెండో సినిమాలు ఇలానే దర్శనమిస్తున్నాయి. ఈరోజుల్లో యువతకు కావాల్సింది ఇదే అంటూ దర్శక నిర్మాతలు కొత్త ప్రయోగాల పేరుతో అందరూ అదే కానిస్తున్నారు.. ముసుగులో గుద్దులాటా అన్నట్లు ఉంది.. ఒకప్పుడు సినిమాలలో ఎక్కడో ఒక చోట కనిపిస్తే ఇప్పుడు మాత్రం.. సినిమాలే అవి వస్తున్నాయి..


డబ్బుల కోసం సినీ ఇండస్ట్రీలో ఎంతకైనా తెగిస్తుందని అర్థమవుతుంది.. శృంగారపు సీన్లు ఉంటే సెన్సార్ కట్ చేసేది ఇప్పుడు సినిమాలు మొత్తం ఇలానే ఉండటంతో వారు కూడా చూసి చూడనట్లు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. యువత అటువంటి సినిమాలకు మొగ్గు చూపడంతో సినీ ఇండస్ట్రీ మాత్రం అదే ఫార్ములాను అమలు చేస్తున్నారు. 


ఇకపోతే గతంలో వచ్చిన చీకట్లో చితకొట్టుడు సినిమా , మొన్న వచ్చిన వచ్చినటువంటి ఆర్ డిక్స్ లవ్ సినిమాలు సెక్స్ భరితమైన సన్నివేశాలు చూపించి అందరి చేత ట్రోల్స్ వేయించుకుంటారు.. వాళ్ళు ఫెయిల్ అయ్యారు.. మేము తక్కువేమీ కాదు చేస్తాము అంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.. సినిమా హిట్ అవడమే వీరికి కావాలి అంతే మిగతాది పట్టదు. ఇలాంటి సినిమాలు జనాలపై చూపే ప్రభావం వల్ల సంగవిద్రోహులు ఎక్కవవుతున్నారు..
 


ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రెండు సినిమాలు మాత్రం నువ్వా నేనా అని జోరు పెంచుతున్నాయి. మొన్న వచ్చిన "ఏడూ చేపల కథ" ఏడుగురు అమ్మాయిలతో అసభ్యకరంగా ఉంది.. ఆ సినిమాలో నటించిన బిగ్ బాస్ బ్యూటీ  భాను అందరి కోపానికి కారణం అయింది..నిన్న స్టార్ హీరోయిన్ అయిన సదా "శ్రీమతి 21f" , సినిమా ట్రైలర్ వచ్చింది ఆమె శృంగారంతో పాటుగా వాడకూడని పదాలు కూడా వాడింది ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: