అందాల ముద్దుగుమ్మ నయనతార. తన నటనతో భిన్నమైన పాత్రల్లో మెప్పిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి.... తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది నయనతార. హీరోల ను తలదన్నే క్రేజ్  తొ  లేడీ సూపర్ స్టార్ గా  ఎదిగింది నయనతార. అయితే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. కాస్త టైం దొరికినప్పుడు తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ తో కనిపిస్తుంటుంది నయనతార. అయితే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నా నయనతార తాజాగా తెలుగులో చిరంజీవి పక్కన సైరా నరసింహారెడ్డి సినిమా లో నటించింది. 

 

 

 

 చిరంజీవి కెరీర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నర్సింహారెడ్డి. ఈ సినిమాలో సైరా నరసింహారెడ్డి భార్యగా  నయనతార నటించింది . అయితే ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేస్తుండడంతో ఈ సినిమాలో నయనతార అక్షరాల 6 కోట్లు తీసుకుందని సమాచారం. అయితే సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్స్ లో ఎక్కడ నయనతార కనిపించలేదు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన మూవీ అయినప్పటికీ నయనతార మాత్రం దీన్ని అంత ప్రత్యేకంగా భావించలేదు. అందుకే ప్రమోషన్స్ కి దూరంగానే ఉంది. అయితే తమన్నా మాత్రం ప్రతి ఒక్క ప్రమోషన్స్ లో కనిపించి మెరిసింది. 

 

 

 

 దీంతో ప్రతి వేదికపై తమన్నా ప్రత్యేక ఆకర్షణ గా నిలవడంతొ  సినిమాలో  తమన్నా నటనకు ఆమె పాత్రకు అందరూ తమన్నాని ప్రశంసించారు. అయితే నయనతార నటన బాగానే ఉన్నప్పటికీ నయనతార గురించి మాత్రం ఎవరు ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో తన గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకు రాక పోవడంతొ  ఈ అమ్మడికి అసహనం తో పాటు అసంతృప్తిని కలిగించిందట ఈ అంశం. కాగా  సైరా నరసింహారెడ్డి సినిమా లో తమన్నా పాత్ర కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే నయనతార ప్రమోషన్స్ కి రాలేదు అని  నయనతార సన్నిహితుల వైపు నుంచి వినిపిస్తున్న.

మరింత సమాచారం తెలుసుకోండి: