తెలుగు లో ‘జర్నీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి
అంజలి తర్వాత వెంకటేష్,మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో అచ్చమైన తెలుగింటి ఆడపడచులా కనిపించింది. ఏంటో నాకలా తెలిసిపోతాయ్ అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది అంజలి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన
అంజలి తర్వాత కోలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడ కొన్ని సినిమాలు తీసినా పెద్దగా సక్సెస్ కాలేదు. కెరీర్ కష్టాల్లో పడబోతుందనుకున్న సమయంలో ఐటమ్ సాంగ్స్ నటించింది.
తెలుగులో బోయపాటి శ్రీను,బన్ని కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ మూవీలో బ్లాక్ బస్టర్ అనే ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది. హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ‘గీతాంజలి’ మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన అంజలికి పెద్దగా కలిసి రాలేదు. తాజాగా ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది ఈ హాట్ బ్యూటీ. కల్తీ నూనె తయారీ కంపెనీ యాడ్ లో ప్రచారం చేసినందుకు అంజలిపై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలిందని కోవైకి చెందిన కోవై సుడర్పార్వై మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఆ కేసుని మరొకరు వెలికితీస్తూ మరో కేసు నమోదు చేసినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కాగా, ఇటీవల ఆ వంట నూన పై పరీక్షలు జరపగా ప్రజలు అనారోగ్యం బారిన పడడం ఖాయమన్న విషయం రీసెంట్ గా నిర్వహించిన పరీక్షల్లో తేలిందట.ఈ నేపథ్యంలో ఆ నూనెను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ మీద, ఆ నూనెను కొనండంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్న
అంజలి మీద కేసు నమోదు అయినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.