హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ వ్యాపించింది.ముఖ్యంగా కోలీవుడ్‌లో మీటూ చాలా ఎఫెక్ట్‌ చూపించిందనే చెప్పాలి. ఇక్కడ సినీ ప్రముఖులను బయటకు ఈడ్చిందని చెప్పవచ్చు. ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుపై ప్రముఖ యువ గాయని, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయి చేసిన మీటూ ఆరోపణలు పెద్ద దుమారాన్నేలేపాయి. ఇక నటుడు, దర్శకుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్, దర్శకుడు సుశీగణేశ్, సీనియర్‌ నటుడు రాధారవి వంటి వారికి మీటూ ఆరోపణలు వదలలేదు. సంచలన నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ లాంటి వారు కూడా మీటూ సమస్యలను ఎదుర్కొన్నట్లు బహిరంగంగానే వెల్లడించారు.


ఇటీవల వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న తమన్నా  ఒక ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మీటూ ప్రస్తావన వచ్చింది.తమకు గతంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాల గురించి హీరోయిన్లు బహిరంగంగా వెల్లడించారు. ప్రముఖులపై ఆరోపణలు గుప్పించారు. ఇలా మీటూ ఆరోపణలు చేసిన వారికి అవకాశాలు రాకపోవడం బాధాకరం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా పేర్కొంది.`నేనెప్పుడూ లైంగిక వేధింపులకు గురవలేదు. అది నా అదృష్టం. సినీ పరిశ్రమలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు.

అయితే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు ధైర్యంగా వెల్లడించడం శుభపరిణామం. ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎదురించి పోరాడాల్సిందే.అలా తాను కూర్చుని చింతించే అమ్మాయిని కాదని చెప్పింది. తాను ఇంతకాలం  నటిగా నిలబడడానికి కారణం తాను అనుకున్నది చేయగలగడమేనని చెప్పింది. పలు శక్తివంతమైన, ఆత్మస్థైర్యంతో సాధిస్తున్న మహిళలు ఇప్పుడు ఉన్నారని తమన్నా అంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విశాల్‌తో నటించిన యాక్షన్‌ చిత్రం వచ్చే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.అయితే అలా మీటూ ఆరోపణలు చేసిన వారికి ఆ తర్వాత అవకాశాలు రాకపోవడం బాధాకరం`అని తమన్నా వ్యాఖ్యానించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: