గీత మాధురి అంటే  పాట నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ అనే పాట  అందరికి గుర్తుకు వస్తుంది ఈ పాట. ఇంకో ఒక విషయం కూడా అందరిని గుర్తుకు చేస్తుంది ఏది ఏమిటి అంటే బిగ్‌బాస్  సీజన్ 2 రన్నర్‌గా ఎంతో మంది హృదయాలలో నిలిచింది గీతా మాధురి. తన  దైనా రీతిలో  పాటలు పాడి అందరిని  ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. సరైన సమయంలో గొంతువిప్పి మాట్లాడి నిజాన్ని బతికిచింది సీజన్ 2 బిగ్ బాస్ హౌస్లో. గీతా మాధురిలో ఉన్న ఈ ధైర్యమే బిగ్‌బాస్  సీజన్ 2 ఫైనల్ వరుకు తీసుకెళ్లింది. విన్నర్‌గా నిలవాల్సిన గీతా మాధురి కొన్నికారణాల వల్ల రన్నర్‌గానే మిగిలి పోవడం జరిగింది.


ఇక బిగ్‌బాస్ సీజన్ 2 మొత్తం తన పాటలతో అందరిని మెప్పించింది. ఇక బిగ్‌బాస్  హౌస్లో గీత, శ్యామల, దీప్తి ఒక జట్టుగా ఉండేవారు. ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడాల్సి సమయంలో చక్కగా మాట్లాడేది.  ఇక సీజన్ 2  అయ్యాయిపోయాక  బయటకు వచ్చిన గీతా మాధురి సోషల్ మీడియాలో మాత్రం  ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడైనా అందరు కలిసి ఏదైనా ఈవెంట్  చేసుకుంటే హాజరై సోషల్ మీడియాలో అప్పటి కప్పుడు అప్డేట్లు పెడుతూనే ఉంటుంది.


ఎప్పుడు స్వరాభిషేకం కార్యక్రమంలో పాల్గొని అప్పటి బిగ్ బాస్ సెట్ గురించి, గడిపిన క్షణాల గురించి తన భావనా తెలుపుతూ ఉంటుంది. ఇక ఇటీవల ఆగస్టు 9న గీతా మాధురికి పండంటి బిడ్డ పుట్టినట్లు అందరికి తెలియచేసింది. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియచేశారు గీత అభిమానులు. తన పాప ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలిపింది. ఇటీవలే  గీత, నందుల పాపకు పేరు కూడా పెట్టడం జరిగింది.


ఈ క్రమంలో  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది పాప గురించి. అందరికి నమస్కారం , నా పేరు దాక్షాయణి ప్రకృతి . మీ గీత, నందుల బ్లాక్ బస్టర్ బేబీని నేనే అంటూ చేసిన ఈ పోస్ట్ పెట్టింది  గీత. ఈ పోస్ట్  మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇక పోస్ట్ కు విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: