తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ గోపీచంద్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరూ వర్షం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా మెప్పించాడు. ఇక ఆ తర్వాత గోపీచంద్ హీరోగా మారి తన కంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నాడు గోపీచంద్. అయితే లౌక్యం  విజయం తర్వాత గోపీచంద్ కు ఒక్క హిట్టు  కూడా పడలేదు. ఎన్నో విభిన్న ప్రయత్నాలు చేసినప్పటికీ గోపీచంద్ కి  విజయం  మాత్రం వరించలేదు. 

 

 

 

 

 అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చాణిక్య సినిమా చేశాడు గోపిచంద్. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే సినిమా రిలీజ్ కు ముందు గోపీచంద్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో  కొత్త దర్శకుడితో ఒక సినిమాకు కొబ్బరికాయ కొట్టారట. అయితే తాజాగా బాక్సాఫీస్ దగ్గర చాణిక్య సినిమా డిజాస్టర్ గా  నిలవడంతో.... ఆ నిర్మాత గోపీచంద్ తో సినిమా చేయడాన్ని  విరమించుకున్నారట . ప్రస్తుతం గోపీచంద్ చేతిలో ఒక సంపత్ నంది సినిమా మాత్రమే ఉంది. కాగా  గోపీచంద్ కూడా ఎలాంటి సినిమా చేయాలి... తన దగ్గర నుంచి ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారట . 

 

 

 

 

 ఎలాంటి కథలను ఎంచుకుంటే ప్రేక్షకులను మెప్పించగలం ... ఎలాంటి కథలతో హిట్ కొట్టవచ్చు అనే దానిపై ప్రస్తుతం తీవ్రంగా ఆలోచిస్తున్నారట గోపీచంద్ .ఇదిలా ఉండగా  గోపీచంద్ స్నేహితుడైన  ప్రభాస్... గోపీచంద్ కెరియర్ నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారట. దీనికోసం ఇద్దరు ముగ్గురు దర్శకులు సంప్రదించి  కథలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు ప్రభాస్ అండగా నిలబడితు ... తన స్నేహితుడు కెరియర్ ని నిలబెట్టే పనిలో పడ్డారట ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: