టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అల వైకుంఠపురములో. గత రెండేళ్లలో తన నుండి వచ్చిన డీజే మరియు నా పేరు సూర్య సినిమాలు, ఫ్యాన్స్ ను పెద్దగా సంతృప్తిపరచకపోవడంతో, ఈ సినిమాతో తప్పనిసరిగా మంచి హిట్ కొట్టాలని బన్నీ ఎంతో శ్రమ పడుతున్నట్లు సమాచారం. ఇక గతంలో త్రివిక్రమ్ మరియు బన్నీల కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టి ఉండడంతో, తప్పకుండా ఈ సినిమా కూడా హిట్ అయి, వారిద్దరికీ హ్యాట్రిక్ విజయాలు అందిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. 

ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్ప్స్ టీజర్ మరియు సామజవరగమనా అనే పల్లవితో సాగె సాంగ్, ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మంచి ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్, రొమాన్స్ తో పాటు ఫ్యాన్స్ ను మరియు మాస్ ఆడియన్స్ ను ఎంతో అలరించేలా ఫైట్స్ మరియు యాక్షన్ సీన్స్ ఉన్నాయని అంటున్నారు. మొత్తం సినిమాలో ఆరు యాక్షన్ సీన్స్ ఉన్నాయని, వాటిలో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మరియు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్, సినిమాకు ఎంతో కీలకమని అంటున్నారు. 

ఇక బన్నీ ఇంట్రడక్షన్ సీన్ కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారట త్రివిక్రమ్. యువ సంగీత దర్శకుడు థమన్ కూడా సాంగ్స్ ఎంతో అదరగొట్టారని, ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ మాత్రమే కాక, మిగతా సాంగ్స్ కూడా ఎంతో బాగా వచ్చాయని టాక్. మొత్తంగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తలు, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయనే చెప్పాలి. మరి సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: