'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా రిలీజ్ అయి అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా షూటింగ్ జరుపుకుంది. అయినా గాని ప్రేక్షకులను అభిమానులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. మరోపక్క బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చేయడంతో దేశవ్యాప్తంగా కూడా విడుదల అయ్యి దారుణమైన దారుణమైన డిజాస్టర్ టాక్ మొట్ట మొదటి రోజు సొంతం చేసుకుంది. దీంతో నెక్స్ట్ సినిమా జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి ఇటీవల 'జాన్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.


దీంతో ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టి ఆల్రెడీ ఒక షెడ్యూలు కూడా పూర్తి చేసుకుని తర్వాత చేయబోయే షెడ్యూల్ నవంబర్ నుండి మొదలు పెట్టడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా బాహుబలి సినిమా యూనిట్ తో కలిసి లండన్ వెళ్ళిన ప్రభాస్..తన పుట్టిన రోజు వేడుకలను లండన్ లోనే జరుపుకోనున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. ఈ సంవత్సరంతో 40వ వసంతంలోకి ప్రభాస్ అడుగుపెట్టబోతున్నాడు.


ఇదిలా ఉండగా లండన్ టూర్ నుండి వచ్చాక జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ సినిమా కోసం ప్రభాస్ బరువు తగ్గడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. సినిమా కథ ప్రకారం ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించబోతున్నాడు. అంటే మొదటి పాత్రకు రెండవ పాత్రకు ఏ మాత్రం సంబంధం ఉండకూడదట. అందుకే దర్శకుడి ఆలోచన ప్రకారం ప్రభాస్ బరువు తగ్గేందుకు జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: