దర్శక ధీరుడు రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి, ఇటీవల ప్రభాస్ హీరోగా తీసిన బాహుబలి రెండు భాగాల వరకు కూడా వరుసగా సూపర్ హిట్స్ కొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక బాహుబలి సినిమాల అద్భుత సక్సెస్ తరువాత, ఆయన పేరు విశ్వవ్యాప్తంగా విరివిగా మారుమ్రోగుతోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ మూవీని తీస్తున్న రాజమౌళి, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో దానిని తెరకెక్కిస్తున్నారు. 

ఇకపోతే ఆయన తీసిన బాహుబలి 1 సినిమా, నేడు లండన్ లోని రాయల్ ఫోర్ట్ హాల్ లో ప్రత్యేకంగా ప్రదర్శితం అవుతుండడంతో, రాజమౌళి సహా హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క, నటుడు రానా, కెమెరా మ్యాన్ సెంథిల్ కుమార్ తదితరులు లండన్ చేరుకొని ఆ షోను వీక్షించనున్నారు. అయితే అంతకముందు ఉదయం సమయంలో లండన్ కు చేరుకున్న రాజమౌళి మరియు ఆయన భార్య రమ గార్లు, అక్కడి కొన్ని ఏరియాల్లో సరదాగా షాపింగ్ చేస్తున్న సమయంలో వారి వద్దకు కొందరు జపాన్ యువతులు రావడం జరిగిందట. 

అయితే వారు రాజమౌళి వద్దకు చేరుకొని, మేము జపాన్ నుండి లండన్ కు బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ చూడడానికి వచ్చాం అని చెప్పడంతో ఆయన ఎంతో ఆశ్చర్యంతో ఆనందపడిపోయారట. అంతేకాక, కొన్ని నిముషాలు వారితో ఎంతో సరదాగా మాట్లాడిన రాజమౌళి, వారితో కలిసి సెల్ఫీలకు ఫోజులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సన్నివేశం మొత్తాన్ని బాహుబలి సినిమా అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసారు ఆ సినిమా నిర్మాతలు. కాగా ప్రస్తుతం ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆ వీడియోపై ఒక లుక్ వేయండి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: