తెలుగులో ఇప్ప టి వరకు ఎంతో మంది సింగర్స్ వచ్చారు.  ఒకప్పుడు సుశీల,జానకి,ఎల్ఆర్ ఈశ్వరి ఇలా పాపులారిటీ సంపాదించిన వారు కేవలం పాల వరకు మాత్రమే పరిమితం అయ్యేవారు.  కానీ ఈ మద్య కొంతమంది సింగర్లు కేవలం పాటల వరకు మాత్రమే కాదు..యాంకరింగ్, నటీమణులుగా కూడా మారుతున్నారు.  ఇలాంటి వారిలో వర్థమాన సింగర్ గీతామాధురి ఒకరు.  గీతా మాధురి అనగానే వెంటనే బిగ్ బాస్ 2 గుర్తుకు వస్తుంది.   తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ షో కి ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే.  బిగ్ బాస్ సీజన్ 1 లో సెలబ్రెటీస్ ని తీసుకున్నారు.  తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 లో ముగ్గురు కామన్ మాన్ తో పాటు సింగర్ గీతామాధురిని తీసుకున్నారు. 


ఈ సీజన్ కి కౌశల్ విన్నర్ అయ్యారు..అయితే చివరి వరకు కౌశల్ కి గట్టి పోటీ ఇచ్చింది గీతామాధురి.  నటుడు, యాంకర్ నందుని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఇద్దరు ఒక్కటయ్యారు.  ఈ జంటకు ఓ పాపు పుట్టిన విషయం తెలిసిందే. గీతా మాధురి, నటుడు నందు తమ ముద్దుల కూతురుకు నామకరణం చేస్తూ తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 'పక్కా లోకల్', 'టాప్ లేచిపోద్ది' వంటి మాస్ పాటలతో పాటు  సుమధురమైన తన గొంతుతో అనేక హిట్ పాటలను పాడి గీతా మాధురి అభిమానులను ఆకట్టుకుంది. 


ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి సెలబ్రెషన్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే.  కాగా, గీతా మాధురి ఆగస్టు 9న మాతృత్వపు మధురిమలను చవిచూసింది. ఇంతకీ పాప పేరేంటో తెలుసా 'దాక్షాయణి ప్రకృతి'. "నేనే... మీ గీతామాధురి, నందుల బ్లాక్ బస్టర్ బేబీని!" అంటూ దాక్షాయణి చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిన్నారి దాక్షాయణి ఫొటోలు ముద్దొస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: