దేవి శ్రీ ప్రసాద్ కొద్దిగా వెనుక పడినట్టు కనిపిస్తున్న ఇలాంటి టైంలో మరో మ్యూజిక్ డైరక్టర్ తమన్ అదరగొడుతున్నాడు. సూపర్ హిట్ ఆల్బం ఇవ్వడంతో పాటుగా బిజిఎం కూడా కొత్తగా ట్రై చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తమన్. మొదట్లో ఏదో మమా అనిపించే పాటలు అందించేసిన తమన్ రాను రాను తన సత్తా చాటుతున్నాడు.


రీసెంట్ గా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన తమన్ ఈసారి రవితేజ డిస్కో రాజా సాంగ్ తో అదరగొట్టేశాడు. ఈసారి ఎస్.పి బాలు గానం ఇవ్వడంతో ఈ పాటకి మరింత క్రేజ్ వచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాట తమన్ నుండి వచ్చిన మరో సూపర్ హిట్ సాంగ్ అని చెప్పొచ్చు.


సీనియర్ వర్సెస్ జూనియర్ గా.. సిద్ శ్రీరాం పాడిన సామజవరగమన సాంగ్ తో ఎస్పిబి సాంగ్ ను పోల్చుతూ నా ముందు నువ్వెంత అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఎస్పిబి సాంగ్ కూడా తమన్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు ఆ సాంగ్ ఎంత క్రేజ్ తెచ్చిందో రవితేజ డిస్కో రాజాకి ఈ సాంగ్ అంత మైలేజ్ తెచ్చింది.


వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అర్జెంట్ గా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్న రవితేజ డిస్కో రాజాతో ఆ హిట్ కోరిక తీర్చుకునేలా ఉన్నాడు. వి.ఐ.ఆనంద్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో ఈ సినిమా తీస్తున్నాడని తెలుస్తుంది. మాస్ మహరాజ్ ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా పండుగ తెస్తుందని అంటున్నారు. డిసెంబర్ 20న క్రిస్ మస్ కానుకగా ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: